కేటీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. ఈ అహంకారమే కొంపముంచిందని ఫైర్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-19 07:05:44.0  )
కేటీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. ఈ అహంకారమే కొంపముంచిందని ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌(Congress)తో దోస్తీ చేసేది కేసీఆరే అని కేటీఆర్‌కు చెప్పారు. చీకట్లో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి డబ్బు సంచులు అప్పగించారని కీలక ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల ఎన్నికలకు కూడా కేసీఆర్(KCR) డబ్బు మూటలు పంపారని అన్నారు.

తమకు రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో దోస్తీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం కేటీఆర్‌కు ఉన్న అహంకారంతోనే బీఆర్ఎస్‌కు ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు. ఆ బాధ భరించలేకే కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు పరిమితం అయ్యారని అన్నారు. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌కు దోస్తీ లేకుండానే ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరం కేసులు అటకెక్కాయా? అని ప్రశ్నించారు. ఆ కేసులు నుంచి బయటపడేందుకే చీకట్లో కేసీఆర్ సంచుల పంపిణీ చేశారని అన్నారు. లేకపోతే బీఆర్ఎస్ పరిస్థితి మరోలా ఉంటుండే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read More: Bandi Sanjay: రేవంత్‌ను దించేందుకు మంత్రులే కుట్రలు చేస్తుండ్రు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed